మహ్మద్ గజనీ :-
ఇతని రాజధాని మధ్య ఆసియా ప్రాంతంలోని గజినీ అనే పట్టణం .
•
ఇతడు క్రీ.శ. 1000-1027 మధ్య 17 సార్లు భారత్ పై దాడి చేసి దోచుకున్నడు .
•
ఇతని దాడులన్నీ ఆర్ధికంగా భారత దేశం దోపిడీ చేయుటకు ఉద్దేసించినవే .
•
గజనీ భారత్ దేశ దండ యాత్రకు అనుమతించిన ఖలీఫా - ఖాదిర్ భిల్లా .
•
గజనీకి ఖలీఫా ఇచ్చిన బిరుదులు - యామినుద్దౌలా , అమాని మిల్ ఉల్లత్.
•
మొదటి దండ యాత్రలో క్రీ.శ 1000-1001 లో కుత్బుండ పురం రాజధానిగా పాలించే హిందూషాహీ వంశస్థుదైన జయపాలుడిని ఓడించాడు .
•
1008లో ఆనంద పాలుడిని,1014 లో త్రిలోచనా పాలుడిని ఓడించాడు . దీనితో హిందూ షాహి వంశం అంతమైంది .
•
1014-1022 మధ్య చందేల రాజు విద్యాధరుని చేతిలో రెండూసార్లు ఓటమి చెంది సంధి కుదుర్చుకున్నాడు
•
ఇతని 16 వ దాడి క్రీ.శ. 1025 లో గుజరాథ్ లోని సోమ నాధ ఆలయాన్ని దోచుకున్నాడు .అప్పుడూ ఆ ప్రాంతాన్ని పాలిస్తున్న రాజు భీమ 1 సోలంకి వంశంకు చెందిన వాడు .
•
ఇతని రాజధాని అనిల్వాడ్ .
•
చివరిగా 17 వదాడి లో 1027 లో జాట్ అనే తెగను అణచి వేశాడు .
•
ఇతను క్రీ.శ 1029 లో మరణించాడు .
•
మహ్మద్ గజనీకి సుల్తాన్ అనే బిరుదునిచ్చిన ఖలీఫ -అల్ కైం.
•
ఇతని ఆస్థానం లోని కవులు - రచనలు
•
1.ఉత్బి : తారిఖ్ -ఎ-యామిని
•
2.ఫిర దౌసి : షా -నామా
•
ఫిరదౌసీ కి గజనీ ఇచ్చిన బిరుదు పారశీక బాషకు హోమర్ . ఇది గజనీ జీవిత చరిత్ర .
•
3.అల్- బెరూని : కితాబ్-ఉల్-హింద్
•
అల్ బెరూని అసలు పేరు అమీర్ హాన్ . ఇతను వారణాసిలో సంస్కృత బాషను నేర్చుకున్నాడు .
•
ఇతను గజనీతో పాటు భారత దేశం వచ్చాడు .
•
గజనీ సంస్కృత బాషతో కూడిన వెండి నాణేలు జారీ చేశాడు .
•
మహమద్ ఘోరీ :-
•
ఇతనికి గల ఇతర పేర్లు షిహాబుద్దిన్ మహ్మద్ , మోముజుద్దీన్ మహ్మద్
•
క్రీ.శ. 1175 నుండి భూభాగం కోసం భారత్ పై దాడులు నివహించాడు .ఇతని ముఖ్య ఉద్దేశం భారత దేశంలో ఇస్లాం రాజ్య స్థాపన చేయుట .
•
క్రీ.శ 1175 లో రెండవ భీమ లేదా రెండవ మూల రాజు చేతిలో " మౌంట్ అబూ " యుద్ధంలో ఓడిపోయి పారిపోయాడు .ఇతనిని ఓడించిన మొదటి భారత పాలకుడు రెండవ భీముడు .
•
తిరిగి క్రీ.శ 1178 లో రెండవ భీముని ఓడించెను .
•
1190 లో మహ్మద్ ఘోరీ భటిండాను ఆక్రమించుకున్నాడు .
•
క్రీ.శ 1191 , 1192 లో పృధ్విరాజ్ చౌహన్ తో తరైన్ వద్ద రెండు యుద్దాలు జరిగాయి .
•
తరైన్ యుద్దాలకు గల మరి యొక పేరు స్థానేశ్వర యుద్ధాలు .
•
మొదటి యుద్ధంలో ఘోరీ ఓడిపోయాడు .
•
రెండవ యుద్దంలో పృధ్విరాజ్ చౌహన్ ను ఓడించి అతని రాజ్యాన్ని ఆక్రమించాడు.
•
క్రీ.శ 1206 లో ఘోరీ నిస్సంతుగా మరణించతంతో అతని సేనాని కుతుబుద్దిన్ ఐబక్ ఘోరీ జయించిన ప్రాంతాలన్నీటిని కలిపి ఢిల్లీ కెంద్రంగా రాజ్యాలను ఏర్పరిచారు .
కాంపిటేటివ్ పరీక్షలకు(APPSC,TSPSC,గ్రామ సచివాలయం,RRB,SSC,DSC,
GATE మొదలగు పరీక్షలకు ) ప్రిపేర్ అవుతున్న అభ్యర్ధులకు శుభవార్త .
అన్నీ పోటీపరీక్షలకు ఉపయోగ పడే విధంగా స్టేట్ ఫేమస్ ఫ్యాకల్టీ చే బోధించబడిన ఫ్రీ వీడియో క్లాసుల కోసం
అక్షరం ఎడ్యుకేషన్స్
(AKSHARAM EDUCATIONS)
చానల్ ని యూట్యూబ్ లో
Subscribe చెయ్యండి.