ప్రాచీన భారత దేశ రాజ్యాలలో చోళ రాజ్యం ఒకటి .
•
సంగం రాజ్యాలలోని మూడు రాజ్యాలలో చోళ రాజ్యం ఒకటి . వీరిని ప్రాచీన చోళులు అందురు .
•
నవీన చోళ రాజ్యాన్ని విజయాళాయుడు స్థాపించాడు .
•
వీరి రాజధాని తంజావూరు .
•
విజయాళయుడు తంజావూరులో ' విసoభ సూదిని ' ఆలయాన్ని నిర్మించాడు .
•
ఆదిత్య చోళుడు చివర పల్లవ పాలకుడైన అపరిజిత వర్మను ఓడించి తోండై మండలాన్ని ఆక్రమించాడు .
•
మొదటి పరాంతక చోళ :-
•
ఇతని పాండ్య రాజు రాజసిం హుణ్ణి ఓడించి పాండ్యుల రాజధాని మధురైను ఆక్రమించుకొని " మధురై కొండ " అనే పేరు ధరించాడు .
•
ఇతను రాష్ట్ర కూట రాజులైన రెండవ కృష్ణున్ని పల్లాల యుద్దంలో ఓడించాడు .
•
తక్కోలం యుద్దంలో మూడవ కృష్ణునిచే ఓడించబడ్డాడు .
•
ఇతను ఉత్తర మేరుర్ శాసనం జారి చేశాడు .ఈ శాసనం చోళుల గ్రామీణ పరిపాలన గూర్చి తెలుపుతుంది .
•
రాజ రాజ చోళుడు :-
•
ఇతని అసలు పేరు అరుమోళి వర్మ
•
ఇతని బిరుదులు - జయకొండ , చోళ మార్తాండ , ముమ్ముడి చొళ , కేరళాంతక , శివ పాద శేఖర .
•
ఇతను తంజావూరులో బృహదీశ్వర ఆలయం లేదా రాజ రాజేశ్వర ఆలయం నిర్మించాడు . దీని ఎత్తు 216 అడుగులు .
•
ఈ ఆలయం 2009 సo|| లో 1000 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది .
•
వేంగీ పాలకుడు రాజరాజ నరేంద్రునికి తన కుమార్తె కుందవ్వనిచ్చి వివాహం జరిపించాడు .
•
వీరికి జన్మించిన వాడే రాజరాజ నరేంద్రుడు .
•
శ్రీ విజయ సామ్రాజ్య పాలకుడు శ్రీ కుమార విజయ తుoగకు నాగ పట్నంలో చూడామణి బౌద్ధ విహారం నిర్మించడానికి అనుమతి ఇచ్చాడు .
•
ఆగ్నేయాషియాలో మలయా,జావా,సుమత్రా దీవులలో వ్యాపించి ఉన్న రాజ్యమే శ్రీ విజయ .
•
ఈ విహారానికి రాజరాజు అనై మంగళం అనే గ్రామాన్ని దానం గా ఇచ్చాడు .
•
సిం హళం పై దండెత్తి 5 వ మహేంద్రుడిని ఓడించాడు .
•
ఉత్తర సిం హళం లో పోలో న్నరువ అనే రాజధాని నగరం నిర్మించాడు .
•
ఉత్తర సిం హళానికి ముమ్ముడి చోళ మండలం అని పేరు పెట్టాడు .
•
మొదటి రాజేండ్రుడు :-
•
ఇతని బిరుదులు - గంగై కొండ , కడారం కొండ , త్రీ సముద్రాదీశ్వర .
•
గంగా నదీ తీరాన పాలవంశ రాజు పాలుడును ఓడించి గంగై కొండ అనే పేరు పొందాడు .
•
కావేరీ నదీ తీరమున గంగై కొండ చోళపురం అనే నూతన రాజధాని నగరాన్ని నిర్మించాడు .
•
ఇతని కాలంలో బంగాళాఖాతమునకు కు చోళ సముద్రం అనే పేరు ఏర్పడింది .
•
ఆది రాజేంద్రుడు(1067-1070) చివరి చోళ రాజు .
•
ఇతని మరణం తర్వాత చోళ రాజులు లేక పోవటం తో వేంగి రాజు రాజ రాజ నరేంద్రునకు అమ్మంగదేవికి జన్మించిన రాజేంద్ర కులుత్తంగ చోళుని పేరుతో క్రీ.శ.1070 లో చోళ సిం హా సనాన్ని అధిష్టించాడు .
•
చోళ చాళుక్యులు :-
•
కులోత్తుంగ చోళులు అతని వారసులను చోళ - చాలుక్యుళుగా వ్యవహరిస్తారు .
•
కులోత్తుంగుడు వేంగీ చాళుక్య రాజ్యాన్ని చోళ రాజ్యంలో విలీనం చేశాడు .
•
ఇతనిని "సంగం తివర్త " గా పిలుస్తారు .
•
•
ఇతడు కులోత్తుంగ చోళపురం (విశాఖ పట్టణాన్ని ) నిర్మించాడు.
•
ఇతని ఆస్థాన కవి జయ గోండార్ కళింగ పట్టుపరణి అనే గ్రంధాన్ని రచించాడు .
•
ఇతను శైవ మతస్థుడు .వైష్ణవులను బాధించాడు .
•
ఇతడి వేధింపులకు తట్టుకోలేక రామానుజుడు హోయ సాల రాజ్యానికి పారిపోయాడు .
•
3 వ కులోత్తుంగుని కాలం లో కవి చక్రవర్తిగా ప్రసిద్ధి చెందిన కంబన్ తమిళంలో రామాయణాన్ని రచించినాడు .
•
ఈయన కాలం లో శెక్కిలార్ అనే తమిళ కవి వ్రాసిన తిర్తుత్తోండర్ పురాణం /పెరియ పురాణం శైవ మతానికి తలమానికం వంటిది .
•
దీనిని తమిళం లో పంచమ వేదం అంటారు .
•
పరిపాలన :-
•
వీరి సచివాలయానికి పెరు మండ్రం అని పేరు . దీనికి అధిపతి-ఓలీయ నాయకుం
•
వీరు రాజ్యాన్ని ఈ విధంగా విభజించారు . మండలాలు - పల్నాడులు - నాడు - కుర్రం - గ్రామాలు .
•
గ్రామాలలో ఉర్ ,సభ , నగరం అనే సభలుండేవి .
•
గ్రామాన్ని 30 వార్డులుగా విభజించే వారు . వార్డులని కుటుంబాలు అంటారు .
•
వార్డు సభ్యులను లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేసేవారు .
•
పండిన పంటలో 1/3 వ వంతు భూమి శిస్తు గా వసూలు చేసేవారు .
•
గ్రామ సంఘం లో 30 మంది సభ్యులు ఉండేవారు .
•
రాజు సైన్యమును కైక్నోలుర్ అని అంటారు .
•
సైనిక దళాలుండే ప్రాంతమును కడగం అని పిలుస్తారు .
•
రాజు అంగ రక్షకులను వేలైక్కారన్ అని పిలుస్తారు .
•
ఈకాలానికి ప్రముఖ రచనలు
•
నానార్ధవ సంక్షేమ - కేశవ స్వామి
•
జీవక చింతామణి - తిరుక్క దేవర
•
కళింగ పట్టపు రాణి -జయగోండార్
•
యాప్పరుంగళం - అమిత సాగరుడు
•
ఋగ్వేద భాష్యం - వెంకట మాధవుడు
•
శ్రీ భాష్యం - రామానుజాచార్యులు
•
పెరియ పురాణం -సెక్కిలార్
•
వీరు ప్రధానం గా శైవులు
•
వీరి కాలం స్థానిక పరిపాలనకు స్వర్ణ యుగం .
•
వీరి కాలం తమిళ భాషకు స్వర్ణయుగం
•
నటరాజ కాంస్య విగ్రహా తయారీ వీరి కాలం లోనే ఆరంభమైనది .
•
చిదంబరం లో అతి పెద్ద నటరాజ విగ్రహం కలదు .
•
వీరి రాజ చిహ్నం వృషభం .