కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ నుంచి సరికొత్త కాంప్లెక్స్‌ ఎరువు


→ ‘పరమ్‌ఫోస్‌ ప్లస్‌’ అనే పేరుతో మెగ్నీషియంతో కూడిన కాంప్లెక్స్‌ ఎరువును కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ విడుదల చేసింది.
→ ఇందులో 16% నత్రజని, 20 శాతం భాస్వరం, 12% సల్ఫర్‌కు తోడు అదనంగా 0.6% మెగ్నీషియం ఉంటాయి.
→ మెగ్నీషియంను జోడించటం వల్ల కిరణజన్య సంయోగక్రియ బాగా జరిగి పత్రహరితం అధికంగా ఉత్పత్తి అవుతుంది.
→ తద్వారా మొక్కలు నాణ్యంగా, త్వరగా పెరుగుతాయి. ఉత్పత్తి కూడా అధికంగా ఉంటుంది.
→ వరి, పత్తి, మొక్కజొన్న, చెరకు, రాగి, వేరుశెనగ పంటలతో పాటు కూరగాయల పెంపకంలో ఈ ఎరువును వినియోగించవచ్చని కంపెనీ వెల్లడించింది.
→ రైతులకు మేలు చేసే ఉద్దేశంతో ఈ వినూత్న ఎరువును ఆవిష్కరించినట్లు కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఎస్‌.శంకర సుబ్రమణియన్‌ వివరించారు