ఎట్టకేలకు నింగిలోకి బోయింగ్‌ వ్యోమనౌక




→ ఏళ్ల తరబడి జాప్యం తర్వాత బోయింగ్‌కు చెందిన స్టార్‌లైనర్‌ వ్యోమనౌక జూన్‌ 5న నింగిలోకి పయనమైంది.
→ ఇందులో భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్‌ విల్‌మోర్‌లు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)కు బయల్దేరారు.
→ అక్కడే వారం బస చేస్తారు. తిరిగి స్టార్‌లైనర్‌లో భూమికి తిరిగొస్తారు. ఈ వ్యోమనౌకకు ఇది తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర.
→ దీన్ని మే నెల మొదటి వారంలో రోదసిలోకి ప్రయోగించేందుకు తొలిసారిగా సన్నాహాలు జరిగాయి.
→ అయితే రాకెట్‌లో సమస్యలు రావడంతో చివరి నిమిషంలో ప్రయోగాన్ని నిలిపివేయాల్సి వచ్చింది.
→ మరోసారి స్టార్‌లైనర్‌ ప్రయోగానికి ప్రయత్నించగా.. సాంకేతిక ఇబ్బందులతో ఆపేయాల్సి వచ్చింది.
→ మూడో ప్రయత్నంలో ఈ వ్యోమనౌక నింగిలోకి బయల్దేరింది.
→ ఈ యాత్ర విజయవంతమైతే.. ఐఎస్‌ఎస్‌కు వ్యోమగాములను పంపడానికి మరో వ్యోమనౌక అమెరికాకు అందుబాటులోకి వస్తుంది.
→ ప్రస్తుతం స్పేస్‌ఎక్స్‌ సంస్థ సేవలే ఆధారమవుతున్నాయి. సునీతా విలియమ్స్‌కు ఇది మూడో అంతరిక్ష యాత్ర.