Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి


Current Affairs Home





ఏఐ సహయంతో కణితుల తొలగింపు మెదడులో కణితులను తొలగించేందుకు హైదరాబాద్‌లోని కిమ్స్‌ ఆసుపత్రి వైద్యులు కృత్రిమ మేధ(ఏఐ), ఆగ్మెంటెడ్‌ రియాలిటీ(ఏఆర్‌) సాయంతో రూపొందించిన ప్రత్యేక పరికరంతో దేశంలోనే తొలిసారిగా 18 శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించారు.
→ ఈ కొత్త విధానం గురించి కిమ్స్‌ ఆసుపత్రి న్యూరో సర్జరీ విభాగాధిపతి డాక్టర్‌ మానస్‌ పాణిగ్రహి విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
→ ‘స్కియా’ పేరుతో కొరియా సంస్థ రూపొందించిన ప్రత్యేక పరికరానికి మెదడులో కణితిని గుర్తించే కచ్చితత్వం ఉందని తెలిపారు.
→ కణితి అటూ, ఇటూ 1.5 మిల్లీమీటర్‌ దూరంలో ఏదైనా రక్తనాళం ఉన్నా గుర్తిస్తుందని వివరించారు.
→ కణితులను తొలగించేప్పుడు కుడి, ఎడమల గుర్తింపుపై అప్పుడప్పుడూ కలిగే సందేహాలకు తావుండదని చెప్పారు.
→ పాతపద్ధతిలో శస్త్రచికిత్సకు కనీసం నాలుగైదు గంటలు పడుతుందని, కొత్త విధానం ద్వారా గంటలోపు పూర్తవుతుందని చెప్పారు.
→ తలలో ఏ భాగంలో ఎంతవరకు కోతపడుతుందన్న వివరాలు రోగి కుటుంబసభ్యులకు ఈ పరికరం ద్వారా దృశ్యరూపంలో వివరిస్తామన్నారు.
→ ఆపరేషన్‌ సమయం 80శాతం వరకూ తగ్గిపోవడంతో రోగి త్వరగా కోలుకోవడమేగాక వారికి ఖర్చులు తగ్గనున్నాయని తెలిపారు.


Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి