Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి


Current Affairs Home





స్వదేశీ క్రూజ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్‌ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్‌ విజయవంతంగా పరీక్షించింది.
→ ఒడిశాలోని చాందీపుర్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌ (ఐటీఆర్‌) ఇందుకు వేదికైంది.
→ తాజా పరీక్షలో క్షిపణికి సంబంధించిన అన్ని ఉపవ్యవస్థలు నిర్దేశిత రీతిలోనే పనిచేశాయని అధికారులు పేర్కొన్నారు.
→ ఐటీసీఎం ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించిన రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) శాస్త్రవేత్తలను రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అభినందించారు.
→ దేశీయ చోదక వ్యవస్థతో కూడిన స్వదేశీ దీర్ఘశ్రేణి సబ్‌సోనిక్‌ క్రూజ్‌ క్షిపణిని అభివృద్ధి చేయడం భారత పరిశోధన ప్రస్థానంలో ఓ కీలక మైలురాయి అని ఆయన అభివర్ణించారు.
→ రాడార్, ఎలక్ట్రోఆప్టికల్‌ ట్రాకింగ్‌ వ్యవస్థ, టెలిమెట్రీ వంటి సెన్సర్ల సాయంతో ఐటీసీఎం ప్రయాణ మార్గాన్ని మొత్తం పరిశీలించినట్లు డీఆర్‌డీవో పేర్కొంది.


Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి