Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి


Current Affairs Home


చైనా సైన్యం చేతిలో రోబో శునకాలు!





→చైనా సైన్యం ఆధునికీకరణ అత్యంత వేగంగా జరుగుతోంది.
→తాజాగా అభివృద్ధి చేసిన రోబో శునకాలను కంబోడియాలో జరిగిన సైనిక విన్యాసాల్లో మరోసారి ప్రదర్శించింది.
→ఈ మర శునకంపై ఓ ఆటోమేటిక్‌ రైఫిల్‌ను అమర్చారు.
→ లక్ష్యంపై గురితప్పకుండా కాల్పులు జరుపుతూ ముందుకు వెళ్లేలా డిజైన్‌ చేశారు.
→ ఇందుకు సంబంధించిన వీడియోను చైనా ప్రభుత్వరంగ మీడియా సంస్థ సీసీటీవీ ప్రసారం చేసింది.
→ ‘‘మా పట్టణ యుద్ధ తంత్రంలో సరికొత్త సభ్యుడు వచ్చాడు. గస్తీ, శత్రువును గుర్తించడం, లక్ష్యంపై దాడి చేయడానికి మనుషుల స్థానంలో ఇది రానుంది’’ అని ఆ వీడియోలో వెల్లడించారు.
→ కంబోడియాలో నిర్వహించిన ‘గోల్డెన్‌ డ్రాగన్‌-2024’ యుద్ధ విన్యాసాల సందర్భంగా దీనిని చిత్రీకరించినట్లు తెలుస్తోంది.
→ ఈ వీడియోలో డ్రోన్‌ తుపాకులను కూడా చైనా సైన్యం ప్రదర్శించింది.
→ వాస్తవానికి గతేడాది నవంబరులో కూడా చైనా, కంబోడియా, వియత్నాం పాల్గొన్న సంయుక్త సైనిక విన్యాసాల్లో ఇవి కనిపించాయి.
→ ఈ మర శునకాలు బ్యాటరీపై ఆధారపడి రెండు నుంచి నాలుగు గంటలపాటు పనిచేస్తాయి.
→ ముందుకు వెనక్కు నడవడం, పడుకోవడం, దూకడం వంటివి చేయగలవు.
→ దీనిలోని మ్యాప్‌ల ఆధారంగా మార్గనిర్దేశం చేసుకొని లక్ష్యం వైపు ప్రయాణిస్తాయి.
→ మార్గమధ్యలో ఎదురయ్యే ఎటువంటి అడ్డంకులనైనా అధిగమించగలవు. వీటిని డ్రోన్ల సాయంతో మోహరించే అవకాశం ఉంది.
→ ఈ రోబో శునకం బరువు 15 కిలోలు ఉంటుంది. దీనిలో ఇన్‌బిల్ట్‌ సెన్సర్లు ఉంటాయి. 4డీ వైడ్‌ యాంగిల్‌ పర్సిప్షన్‌ సిస్టమ్‌ను అమర్చారు.
→ సైనికులతో సమానంగా ఇది యుద్ధ విన్యాసాలు చేయగలదు. చైనాకు చెందిన యూనీట్రీ సంస్థ ఈ మర శునకాలను రూపొందించినట్లు తెలుస్తోంది.
→ వీటి ఖరీదు మోడల్‌ను బట్టి రూ.2.3 లక్షల నుంచి రూ.83.36 లక్షల వరకు ఉంది.

Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి