•మన దేశం లోరవాణా వ్యవస్థను నాలుగు రకాలుగా విభజించారు .
1)రోడ్డు రవాణా
2)రైలు రవాణా
3)వాయు రవాణా
4)జల రవాణా
రోడ్డు రవాణా
•భారత దేశం లో రోడ్డు మార్గాల పొడవు - 36,22,000 కి.మీ.
•ప్రపంచంలో రోడ్డు మార్గాలు అధికంగా కలిగిన దేశాలు -అమెరికా,భారతదేశం.
•కేరళ రాష్ట్రం లో అన్ని గ్రామాలకు నూరు శాతం రోడ్లు కలవు .
•అత్యధిక శాతం రోడ్డు మార్గాలు అభివృద్ధి చెందిన రాష్ట్రం -హర్యానా
•పరిపాలనా సౌలభ్యం కోసం రోడ్లను 5 రకాలుగా విభజించారు
1)జాతీయ రహదారులు
2)రాష్ట్ర రహదారులు
3)జిల్లా రహదారులు
4)గ్రామీణ రహదారులు
5)సరిహద్దు రోడ్డులు
జాతీయ రహదారులు :-
•రాష్ట్ర రాజధానులు,ఓడ రేవులను ,వాణిజ్య నగరాలను అనుసంధానం చేయునవి .
•జాతీయ రహదారుల చట్టం 1956 లో చేసారు .
•జాతీయ రహదారుల నిర్వహణకు 1988 లో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ని స్థాపించారు .
•జాతీయ రహదారులు అధికంగా కల రాష్ట్రం -ఉత్తర ప్రదేశ్
•జాతీయ రహదారులు అల్పంగా కల రాష్ట్రం-సిక్కిం
•భారత దేశం లో కల జాతీయ రహదారుల సంఖ్య -218
•జాతీయ రహదారుల నూతన నెంబర్లు
NH 4 | NH 40 |
NH 5 | NH 16 |
NH 7 | NH 44 |
NH 9 | NH 65 |
NH 16 | NH 63 |
NH 43 | NH 26 |
NH 63 | NH 67 |
NH 202 | NH 163 |
NH 205 | NH 42 |
NH 221 | NH 30 |
NH 222 | NH 61 |
రాష్ట్ర రహదారులు:-
•రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యం లో ఉంటాయి.
•రాష్ట్ర రాజధానులు మరియు జిల్లా యొక్క ముఖ్య పట్టణాలతో అనుసంధానం చేయబడతాయి .
•వీటి మొత్తం పొడవు 1,63,898 కి.మీ.
•ఇవి మహారాష్ట్ర లో అధికంగా కలవు .
జిల్లా రహదారులు:-
•జిల్లా కేంద్రాలను మండలంతో అను సంధానం చేయును .
•వీటిని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది .
•ఇవి మహారాష్ట్రలో అధికంగా కలవు .
•వీటి మొత్తం పొడవు 25,77,396 కి.మీ.
గ్రామీణ రహదారులు:-
•వీటిని గ్రామ పంచాయతీలు నిర్వహిస్తాయి .
•వీటి నిర్వహణకు 2000 సం || లో ప్రధానమంత్రి గ్రాం సడక్ యోచన ప్రారంభం అయినది .
•ఇవి ఎక్కువగా కేరళ,మహారాష్ట్ర లో కలవు.
సరిహద్దు రోడ్డులు:-
•సరిహద్దు ప్రాంతాలలో రోడ్డులు సరుకు సరఫరాకి మరియు సైనిక అవసరాలకి ఉపయోగపడుతుంది .
•లెహ్ నుంచి మనాలి వరకు భారత దేశం లో ఎత్తైన ప్రదేశంలో రోడ్డు మార్గాన్ని నిర్మించారు .
•ఈ రహదారి సముద్రమట్టానికి 4270 మీటర్ల ఎత్తులో కలదు .
రైలు రవాణా
•భారత దేశం లో మొదటి రైలు ప్రయాణం 1853 ఏప్రియల్ 16 న ముంబాయి లోని బోరి బందర్ నుండి థానే వరకు ప్రారంభించబడినది .
•1890 లో రైల్వే చట్టం చేయబడినది .
•1901 లో రైల్వే బోర్డ్ ఏర్పాటు చేసారు .
• భారత దేశం లోమొదటి రైలు ప్రమాదం 1923 లో పంజాబ్ నుంచి హౌరా కి మధ్య రైలు పట్టాలు తప్పి 154 మంది మరణించారు .
• కంప్యూటరైజ్డ్ రిజర్వేషన్ లు 1986 లో ప్రారంభించారు .
• దేశం లో అతిపొడవైన రైలుమార్గం జమ్మూతావి -కన్యాకుమారి 3726 కి.మీ.
•మొదటి రైల్వే శాఅఖామంత్రి -జాన్ మథాయి
•పర్వతాల గుండా ఏర్పాటు చేయబడిన మొదటి రైల్వే స్టేషన్ -థాల్ మరియు బోరా శ్రేణులు
•దేశం లో అతి పొడవైన రైలు వంతెన -ఇడవల్లి -వల్లార్ పాదం 4.62 కి.మీ కేరళ
•ఫైయిరీ క్వీన్ భారత మొదటి రైల్ ఇంజన్
ఇది ప్రపంచంలో కెల్లా పురాతన స్టీం ఇంజన్
•ప్రపంచంలోకెల్లా పొడవైన ప్లాట్ ఫాం గోరఖ్ పూర్ 1355 మీటర్లు
•ప్రపంచంలో విద్యుదీకరించిన రైల్వే లలో రష్యాతర్వాత భారత్ రెండవది .
•భారత రైల్వే ల ప్రధాన కేంద్రం -ఢిల్లీ
•భారత రైల్వేల శాశ్వత చిహ్నం -బోలు ది గార్డ్ .
•రైలు మార్గాలు లేని రాష్ట్రాలు -మేఘాలయ ,సిక్కిం .
•రైలు మార్గాల్ల పొడవు ఎక్కూగా కల్గిన రాష్ట్రం -ఉత్తర ప్రదేశ్
• ప్రపంచంలోకెల్ల అత్యధిక ఉద్యోగులను కలిగిన సంస్థ -భారత రైల్వే
•భారత దేశం మొత్తం 17 రైల్వే జోన్లు ఉన్నాయి .
•మొదటగా ఏర్పడిన రైల్వే జోన్ -దక్షిణ రైల్వే
• కోల్ కతా 3 జోన్ లకు కేంద్రం
•భారత్ దేశం లో కొన్ని రైల్వే స్టేషన్ లు వాటి ప్రత్యేకతలు :-
ముంబాయి స్టేషన్ -భారత దేశం లో మొదటి రైల్వే స్టేషన్
చత్రపతి శివాజీ టెర్మినస్ -అత్యధిక రైళ్ళూఅగే స్టేషన్
ప్రపంచంలో అతిపెద్ద ఇంజన్ల తయారీ సంస్థ -చిత్తరంజన్ లోకోమోటివ్స్
S No. | Railway Zone | Zone Headquarters | Railway Divisions |
1 | Northern Railway | Delhi | Delhi, Ambala, Firozpur, Lucknow NR, Moradabad |
2 | Northeast Frontier Railway | Guwahati | Alipurduar, Katihar, Rangiya, Lumding, Tinsukia |
3 | Eastern Railway | Kolkata | Howrah, Sealdah, Asansol, Malda |
4 | South Eastern Railway | Kolkata | Adra, Chakradharpur, Kharagpur, Ranchi |
5 | South Central Railway | Secunderabad | Secunderabad, Hyderabad Vijayawada, GuntakalGuntur, Nanded |
6 | Southern Railway | Chennai | Chennai, Tiruchirappalli, Madurai, Palakkad, Salem, Thiruvananthapuram |
7 | Central Railway | Mumbai | Mumbai, Bhusawal, Pune, Solapur, Nagpur |
8 | Western Railway | Mumbai | Mumbai WR, Ratlam, Ahmedabad, Rajkot, Bhavnagar, Vadodara |
9 | South Western Railway | Hubballi | Hubballi, Bengaluru, Mysuru, |
10 | North Western Railway | Jaipur | Jaipur, Ajmer,Bikaner, Jodhpur |
11 | West Central Railway | Jabalpur | Jabalpur, Bhopal Kota |
12 | North Central Railway | Allahabad | Allahabad, Agra, Jhansi |
13 | South East Central Railway | Bilaspur | Bilaspur, Raipur, Nagpur SEC |
14 | East Coast Railway | Bhubaneswar | Khurda Road, Sambalpur, Waltair |
15 | East Central Railway | Hajipur | Danapur, DhanbadMughalsarai, Samastipur, Sonpur |
16 | Konkan Railway | | Navi Mumbai |
17 | Kolkata Metro Railway | Kolkata | Kolkata |
జల రవాణా
•1958 లోషిప్పింగ్ బోర్డ్ ని ఏర్పాటు చేయటం జరిగినది .
•అతి తక్కువ ఖర్చుతో జరిగే రవాణా -జల రవాణా
•నేషనల్ షిప్పింగ్ డే -మార్చి 28
•జల రవాణాను 2 రకాలుగా విభజించవచ్చు .
1 అంతస్థలీయ జల రవాణా
2. జాతీయ జల రవాణా
•భారత భూభాగం లో నదులు నదులు ,కాలువల ద్వార జరిగే రవాణా
•షిప్పింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాను 1961 లో ఏర్పాటు చేసారు .
•నదుల ద్వారా జల రవాణా జరుగుతున్న అంతస్థలీయ జల మార్గాల పొడవు 5200 కి.మీ.
జాతీయ జల రవాణా
జాతీయ జల మార్గం -1
•ఈ మార్గం గంగా నది పై కలదు .మొత్తం పొడవు 1620 కి.మీ.
•దీనిని 1986 అక్టోబర్ లో ప్రారంభించారు .
•ఈ మార్గం ఉత్తర ప్రదేశ్ లోని అలహా బాద్ నుంచి బీహార్ లోని పాట్నా మీదుగా పశ్చిమ బెంగాల్ లోని హల్దియా వరకు కలదు .
•ఇది భారత దేశం లోని అత్యంత పొడవైన అంతస్థలీయ మార్గం
•దీనిని గంగా-భాగీరది-హుగ్లీ జల మార్గం అని అంటారు .
2) NW-2
•ఇది బ్రహ్మ పుత్ర నదిపై కలదు .
•ఇది అస్సాం లోని సాదియా నుంచి బంగ్లాదేశ్ లోని దుబ్రి వరకు కలదు .
•దీని పొడవు 891 కి.మీ.
•దీనిని 1988 అక్టోబర్ 26 న ప్రారంభించారు .
NW 3 :-
•పశ్చిమ తీరంలోని కాలువలపై కలదు .
•దీని పొడవు 205 కి.మీ.
NW 4:-
•దీని మొత్తం పొడవు 1095 కి.మీ.
•ఇది ఆంధ్రప్రదేశ్ పుదుచ్చేరి ప్రాంతాల మధ్య కలదు .
NW 5 :-
•ఇది ఒడిశాలో కలదు
•దీని పొడవు 623 కి.మీ.
కాలువల ద్వారా జల రవాణా:-
•భారత దేశం లో అతి పొడవైన రవాణా కాలువ బకింగ్ హాం కాలువ దీని పొడవు 412 కి.మీ
•ఇది ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూర్ నుండి తమిళనాడు వరకు కలదు .
అంతర్జాతీయ జల రవాణా
•భారత దేశం లో మొత్తం 13 ప్రధాన ఓడ రేవులు ,20 మధ్య తరహా ఓడ రేవులు ,187 చిన్న తరహా ఓడ రేవులు కలవు .
పశ్చిమ తీరం లోని ఓడ రేవులు
1. కాండ్ల( గుజరాత్ ):-
•పోటు పాటులపై ఆధారపడి పని చేస్తున్న ఏకైక టైడల్ ఓడ రేవు .
•స్వాతంత్య్రం వచ్చిన తర్వాత స్థాపించిన మొదటి ఓడ రేవు .
•పెట్రోలియం ,వంటనూనె,ఉప్పు ప్రధాన ఎగుమతులు
•ఈ రేవు కచ్ సింధూ శాఖలో కలదు .
•పాకిస్థాన్ కి సమీపంలో ఉన్న ఓడ రేవు .
•ఈ తీరంలోనే ముంద్రా వద్ద అదానీ వారు ఒక ఓడ రేవుని నిర్మించారు .
2)ముంబాయ్ :-
•పశ్చిమ తీరంలో ఏర్పడిన సహజసిద్ధ ఓడరేవు .
•దేశం లో అతిపెద్ద ఓడ రేవు .
•ఈ రేవు వలన ముంబాయ్ కి గేట్ వే ఆఫ్ ఇండియా అనే పేరు వచ్చింది .
•దేశ సముద్ర రవాణాలో 1/4 వంతు ఇక్కడనే జరుగుతుంది .
•వస్త్రాలు,ముడి ప్రత్తి ,లెదర్,పొగాకు ప్రధాన ఎగుమతులు
3)నవసేవ ఓడరేవు:-
•దీనిని ముంబాయి సమీపంలో నిర్మించారు .
•దేశం లో అత్యంత ఆధునికమైన ఓడ రేవు .
•ప్రధాన ఎగుమతులు కాటన్ వస్త్రాలు
మర్మగోవా :-
•జువారీ నదీ తీరం లో కలదు .
•ఇనుప ఖనిజముని ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న ఓడరేవు .
•ఇచ్చటి నుంచి స్పాంజ్ ఐరన్ ని జపాన్ కి ఎగుమతి చేస్తున్నారు .
న్యూ మంగుళూరు:-
•గురుపూర్ నది ఒడ్డున కలదు .
•ఇనుము,కాఫీ,సుగంధద్రవ్యాలు ప్రధాన ఎగుమతులు
•పెట్రోలియం,ఎరువులు దిగుమతులు
కొచ్చిన్:-
•దీనిని క్వీన్ ఆఫ్ అరేబియన్ సీ గా పిలుస్తారు .
•ఇది వెంబనాడ్ కాయిల్ వద్ద కలదు .
•కంటైనర్ లు ,కొబ్బరి,సుగంధ ద్రవ్యాలు ప్రధాన ఎగుమతులు
•పెట్రోలియం,రసాయనాలు,సిమెంట్,ఎరువులు ప్రధాన దిగుమతులు
•మలబార్ తీరం లోకల సహజ సిద్ధమైన ఓడ రేవు .
•సంవత్సరం పొడవునా అవరోధం లేకుండా రవాణాకు వీలైన నౌకాశ్రయం .
తూర్పు తీరం లో కల ఓడరేవులు
ట్యూటి కోరన్
•హిందూ మహాసముద్ర తీరం లో కల ఏకైక ఓడ రేవు .
•మానవ నిర్మిత ఓడ రేవు.
•పాండ్య రాజుల కాలం లో ప్రధాన ఓడరేవు .
•భారత దేశపు దక్షిణ కోనన కల ఓడరేవు .
చెన్నై
•తూర్పు తీరం లో అతి పెద్ద ఓడ రేవు .
•భారత దేశం లో అత్యంత పురాతనమైన ఓడ రేవు .
•దేశం లో రెండవ పెద్ద ఓడ రేవు .
•దేశ సముద్ర రవాణాలో 15 % వాటా కలిగి ఉంది .
ఎన్నోర్
•తమిళనాడు లో కలదు .
•నెదర్లాండ్ సహకారంతో నిర్మించారు .
•కార్పోరేటు రంగం లో నిర్మించిన ఏకైక ఓడరేవు .
•చెన్నై రేవు కి అనుసంధానం గా నిర్మించారు .
•2014 న ఈ ఓడ రేవుని కామరాజన్ ఓడ రేవుగా మార్చారు
విశాఖపట్నం
•దేశం లో అతి లోతైన ప్రధాన ఓడ రేవు .
•దేశం లోనే అత్యంత సురక్షితమైన ఓడ రేవు .
•జపాన్ దేశమునకు విశాఖ పట్టణము నుండి ఇనుము ఎగుమతి చేయబడుతుంది .
•క్రూడ్ ఆయిల్ ,యంత్రాలు దిగుమతులు
పోర్ట్ బ్లయర్
•ఇది అండమాన్ నికోబార్ దీవులలో కలదు
వాయు రవాణా
•మన దేశం లో పౌర విమానయాన సర్వీసులు 1920 లో ప్రారంభము అయ్యినవి .
•దేశం లో మొదటి ఏయిర్ లైన్స్ సర్వీస్ టాటా ఎయిర్ లైన్స్ 1932 లో ప్రారంభించబడినది .
•1953 లో భారత ప్రభుత్వం వాయుమార్గాలను జాతీయం చేసింది .
•ఓపెన్ స్కైపాలసీ ద్వారా 1994 లో ప్రైవేటు సంస్థలకు విమానయాన రంగంలో ప్రవేశం కల్పించారు .
•భారత దేశం లో మొదటి గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం
•భారత దేశం లో అతి పెద్ద విమానాశ్రయం చత్రపతి శివాజీ విమానాశ్రయం ముంబాయ్
•ప్రపంచంలో అత్యంత రద్దీ విమానాశ్రయం -జె.ఎఫ్ .కెనడీ విమానాశ్రయం ,న్యూ యార్క్
•ప్రయివేటు రంగంలో నిర్మించిన తొలి దేశీయ విమానాశ్రయం - నెడుంబస్సేరి ,కొచ్చిన్
•దేశం లోకెల్లా ఎత్తైన ప్రదేశం లోగల విమానాశ్రయం - లేహ్
•ఎక్కువ అంతర్జాతీయ విమానాశ్రయాలు కేరళ లో కలవు .
•ఎక్కువ విమానాశ్రయాలు గుజరాత్ లో కలవు