కేంద్రపాలిత ప్రాంతాలు

• కేంద్రపాలిత ప్రాంతం గురించి రాజ్యాంగం లో 8 వ భాగం లో వివరించటం జరిగినది .
• కేంద్రపాలిత ప్రాంతాలను రాష్ట్రపతిచే నియమించబడ్డ పాలనాధికారి ద్వారా నిర్వహించబడుతుంది .
• ప్రస్తుతం దేశం లో ఏడు కేంద్రపాలిత ప్రాంతాలున్నాయి .
1.అండమాన్ నికోబార్ దీవులు
2.లక్షద్వీప్
3.పాండిచ్చేరి
4.ఢిల్లీ
5.చంఢీఘడ్
6.డయ్యూ డామన్
7.దాద్రా నగర్ మరియు హవేలీ
కేంద్రపాలిత ప్రాంతాలు మరియు పార్లమెంట్ స్థానాలు :-
కేంద్రపాలిత ప్రాంతం ఏర్పడిన సంవత్సరం అసెంబ్లీ స్థానాలు లోక్ సభ స్థానాలు రాజ్య సభ స్థానాలు
అండమాన్ నికోబార్ దీవులు 1956 -1-
ఢిల్లీ 1956 70 7 3
లక్ష దీవులు 1956 -1-
దాద్రా నగర్ హవేలీ 1961 -1-
డామన్ డయ్యూ 1962 -1-
పుదుచ్చేరీ 1962 30 1 1
చండీఘడ్ 1966 - 1 -
•కేంద్రపాలిత ప్రాంతాలలో శాసనసభ మరియు మంత్రి మండలి ఏర్పాటుకు అవకాసం కల్పించిన నిబంధన -239 A
•కేంద్రపాలిత ప్రాంతాలలో సొంత శాసన సభలు కలిగినవి -పాండిచ్చేరి,ఢిల్లీ
•పాండిచ్చేరీ 1963 నుంచి ఢిల్లీ 1993 నుంచి శాసన సభలను కలిగి ఉన్నాయి .
•శాసన సభ లేని కేంద్రపాలిత ప్రాంతాలకు చట్టలను రూపొందించే అధికారం కేంద్ర పార్లమెంట్ కు కలదు .
•కేంద్రపాలిత ప్రాంతాలలో హై కోర్ట్ ఏర్పరిచే అధికారం భారత పార్లమెంట్ కు 241 వ నిబంధన ఉంటుది
•ప్రత్యేక హైకోర్ట్ కలిగిన ఏకైక కేంద్రపాలిత ప్రాంతం -ఢిల్లీ
•ఢిల్లీ పాలనాధికారి -లెఫ్టినెంట్ గవర్నర్
•చండీఘడ్ పాలనాధికారి -పంజాబ్ గవర్నర్
•69 వ రాజ్యాంగ సవరణ చట్టం ఢిల్లీని నేషనల్ క్యాపిటల్ టెరిటరీ గా గుర్తించటం జరిగినది .