భారత రాజ్యాంగం -లక్షణాలు

•రాజ్యాంగం అనే భావనను మొదటి సారి అరిస్టాటిల్ ప్రతిపాదించాడు .
•రాజనీతి శాస్త్ర పితామహుడు -అరిస్టాటిల్
•ప్రపంచంలో ఇంగ్లాండ్ రాజ్యాంగాన్ని తొలి రాజ్యాంగంగా గుర్తిస్తారు .
•అమెరికా రాజ్యాంగాన్ని తొలి లిఖిత రాజ్యాంగం గా గుర్తిస్తారు .
•ప్రపంచంలో ఏకైక అలిఖిత రాజ్యాంగం - ఇంగ్లాండ్ రాజ్యాంగం
•రాజ్యాంగ పరిషత్ ద్వారా రాజ్యాంగ నిర్మాణం అనే భావనను భారత జాతీయ కాంగ్రెస్ 1918 ఢిల్లీ సమావేశం లో తీర్మానించింది .
•సైమన్ కమీషన్ బహిష్కరణ సందర్భంగా ఇంగ్లాండ్ యం.పి. బిర్కెన్ హెడ్ అందరికీ ఆమోదయోగ్యమైన రాజ్యాంగమును భారతీయులు రూపొందించుకోగలరా? అని సవాలు విసిరాడు .
•ఈ సవాలుకు ప్రతిగా భారత జాతీయ కాంగ్రెస్ 1928లో మోతీలాల్ నెహ్రూ అధ్యక్షతన ఒక కమిటీ నియమించింది .
•ఈ కమిటీ నివేదికను నెహ్రూ నివేదిక అని పిలుస్తారు .
•1934 లో రాడికల్ డెమోక్రాటిక్ పార్టీ స్థాపకుడు ,కమ్యూనిస్టు నాయకుడైన M.N.రాయ్ రాజ్యాంగాన్ని భారతీయులే స్వయంగా రూపొందించుకోవాలని మొదటి సారి సూచించాడు .
•1935 లో జాతీయ కాంగ్రెస్ అధికారికంగా రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది .
•క్రిప్స్ రాయబారం 1942 లో మొదటి సారిగా రాజ్యాంగ పరిషత్ ఏర్పాటుకు హామీ ఇచ్చింది .
•1946 లో కేబినేట్ మిషన్ ప్లాన్ సిఫార్సుల మేరకు రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేయబడినది .
•కేబినేట్ మిషన్ భారత దేశానికి వచ్చిన తేదీ - 1946 మార్చి 23
•1945 డిసెంబర్ నుండి 1946 జనవరి వరకు రాష్ట్ర శాసన సభలకు ఎన్నికలు జరిగాయి .
•1946 జులైలో రాజ్యాంగ సభకు ఎన్నికలు జరిగాయి .
•రాజ్యాంగ సభకు ఎన్నికైన సభ్యులు - 389
రాజ్యాంగ పరిషత్ లో వివిధ పార్టీలు సాధించిన స్థానాలు :-
జాతీయ కాంగ్రెస్ 202
ముస్లిం లీగ్ 73
స్వతంత్ర అభ్యర్ధులు 7
ఇండియన్ క్రిష్టియన్లు 2
ఆంగ్లో ఇండియన్లు 1
యూనియనిస్ట్ ముస్లిం 3
కృషక్ ప్రజాపార్టీ 1
హిందూ మహాసభ 1
షెడ్యూల్డ్ జాతుల ఫెడరేషన్ 1
కమ్యూనిష్టులు 1
మొత్తం 296
•దేశ విభజన తర్వాత రాజ్యాంగ పరిషత్ సభ్యుల సంఖ్య - 299 .
•వీరిలో 229 మంది రాష్ట్రాలనుంచి ,70 మంది స్వదేశీ సంస్థానాల నుండి ప్రాతినిధ్యం వహించారు .
•ముస్లిం లీగ్ రాజ్యాంగ పరిషత్ సమావేశాలకు సభ్యత్వం కల్గి ఉన్నా హాజరు కాలేదు .
•రాజ్యాంగ పరిషత్ లో మహిళా సభ్యులు - 15
•రాజ్యాంగ పరిషత్ లో సభ్యత్వం లేని ప్రముఖులు
1) మహాత్మా గాంధీ 2) మహ్మద్ అలీ జిన్నా
•రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశం 1946 డిసెంబర్ 9 న ఢిల్లీ నగరంలోని పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో జరిగింది .
•తొలి సమావేశామునకు హాజరైనవారు -211 మంది .
•వీరిలో ఫ్రెంచి సాంప్రదాయాన్ని అనుసరించి పెద్దవాడైన సచ్చిదానంద సిన్ హా ను తాత్కాలిక అధ్యక్షుడిగా 2 రోజులు పనిచేశారు .
•రాజ్యాంగ పరిషత్ నకు శాశ్వత అధ్యక్షుడిగా డా. బాబూ రాజేంద్రప్రసాద్ ఎన్నికైనారు .
•రాజ్యాంగ పరిషత్ చిహ్నం - ఏనుగు
•రాజ్యాంగ పరిషత్ లో పోటీ చేయకుండా ,ఎన్నిక కాకుండా సభ్యులైనవారు - కెటి.షా ,సర్వేపల్లి రాధాకృష్ణన్ ,గోపాలస్వామి అయ్యంగార్
•రాజ్యాగ పరిషత్ లో సభ్యత్వం పొందిన తెలుగు వారు - టంగుటూరి ప్రకాశం ,పట్టాభి సీతారామయ్య,కల్లూరి సుబ్బారావు ,ఎన్.జి.రంగా,నీలం సంజీవరెడ్ది,దుర్గాభాయ్ దేశ్ ముఖ్
రాజ్యాంగ పరిషత్ లో పార్టీలు ప్రాతినిధ్యం
అఖిల భారత షెడ్యూల్ కులాలు బి.ఆర్.అంబేద్కర్
అఖిలభారత హిందూ మహాసభ శ్యాం ప్రసాద్ ముఖర్జీ
అఖిల భారత మహిళా సంఘం హంసా మెహతా
పార్శీలు హెచ్.పి.మోడీ
ముస్లింలు మౌలానా అబుల్ కలాం ఆజాద్
భారతీయ క్రైస్తవులు హెచ్.సి.ముఖర్జీ
ఆంగ్లో ఇండియన్ లు ప్రాక్ ఆంథోనీ
భారత జాతీయ కాంగ్రెస్ బాబూ రాజేంద్ర ప్రసాద్ ,జవహర్ లాల్ నెహ్రూ ,వల్లభ్ భాయ్ పటేల్
జమిందార్ల సలహా సంఘం దర్భంగా మహారాజా ,కామేశ్వర్ సింగ్
రాజ్యాంగ పరిషత్ కమిటీలు :-
•రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగ రచన కోసం 22 కమిటీలను నియమించింది .
•రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేసిన అతిపెద్ద కమిటీ సలహా సంఘం .
•ఇందులో ఒక చైర్మన్ 54 మంది సభ్యులు ఉంటారు.
సలహా సంఘ కమిటీ చైర్మన్వల్లభ్ భాయ్ పటేల్
కేంద్ర రాజ్యాంగ కమిటీ చైర్మన్ జవహర్ లాల్ నెహ్రూ
కేంద్ర అధికారాల కమిటీ చైర్మన్ జవహర్ లాల్ నెహ్రూ
రాష్ట్ర అధికారాల కమిటీ ఛైర్మన్ వల్లభ్ భాయ్ పటేల్
రాష్ట్రాల కమిటీ చైర్మన్ జవహర్ లాల్ నెహ్రూ
రాజ్యాంగ నియమ నిబంధన ల కమిటీ చైర్మన్ డా.బాబూ రాజేంద్ర ప్రసాద్
అల్ప సంఖ్యాక వర్గాల కమిటీ చైర్మన్ హెచ్.సి. ముఖర్జీ
ముసాయిదా కమిటీ చైర్మన్ బి.ఆర్ అంబేద్కర్
ప్రాధమిక హక్కుల కమిటీ చైర్మన్ వల్లభ్ భాయ్ పటేల్
సభా వ్యవహారాల కమిటీ చైర్మన్ కె.ఎం .మున్షీ
రాజ్యాంగ పరిషత్ విధుల కమిటీ చైర్మన్ జి.వి. మౌలంకర్
జాతీయ పతాకం పై తాత్కాలిక కమిటీ చైర్మన్ రాజేంద్ర ప్రసాద్
ముసాయిదా కమిటీ :- •ముసాయిదా కమిటీ చైర్మన్ -బి.ఆర్.అంబేద్కర్
•ముసాయిదా కమిటీ 1947 ఆగష్టు 29 న 7గురు సభ్యులతో ఏర్పడినది .
1)కె.ఎం.మున్షీ
2) అల్లాడి కృష్ణస్వామి అయ్యర్
3) ఎన్.గోపాలస్వామి అయ్యంగార్
4) T.T.కృష్ణమాచారి
5)సయ్యద్ మహ్మద్ షాదుల్లా
6) N.మాధవరావు
•రాజ్యాంగ పరిషత్ ,రాజ్యాంగ ముసాయిదాను వాక్యో -వాక్య విచారణ పద్ధతి ద్వారా పరిశీలించింది .
•భారత రాజ్యాంగంలో 75 % అంశాలు 1935 భారత ప్రభుత్వ చట్టం నుంచి గ్రహించినవే .
•1935 చట్టాన్ని భారత రాజ్యాంగానికి మాతృక గా వర్ణిస్తారు.
భారత రాజ్యాంగ సభ తేదీలు :-
•మొదటి సమావేశం - 1946 డిసెంబర్ 9
•రాజ్యాంగ పరిషత్ ఛైర్మన్ ను ఎన్నుకున్నది - 1946 డిసెంబర్ 11
•జవహర్ లాల్ నెహ్రూ ఆశయాలు,లక్ష్యాల తీర్మానం- 1946 డిసెంబర్ 13
•జాతీయ పతాకాన్ని ఆమోదించిన తేదీ - 1947 జులై 22
•రాజ్యాంగ సభ చివరి సమావేశం- 1950 జనవరి 24
•జనగణమన,వందేమాతరంలను ఆమోదించిన తేదీ - 1950 జనవరి 24
•భారత రాజ్యాంగం 1950 జనవరి 26 న అమలులోకి వచ్చింది.
•రాజ్యాంగ రూపకల్పనకు తీసుకున్న సమయం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు .
•మొత్తం జరిగిన సమావేశాలు -11
రాజ్యాంగ రచనకు అయిన ఖర్చు- ₹ 64 లక్షలు
•భారత రాజ్యాంగ ముసాయిదా 1948 ఫిబ్రవరి 21 న ప్రచురించబడినది.
•114 రోజులు రాజ్యాంగం పై చర్చించారు.
•రాజ్యాంగం అమలులోనికి వచ్చినప్పుడు 395 నిబంధనలు (ఆర్టికల్స్ ) ,8షెడ్యూల్స్,22 భాగాలు,3 అనుబంధాలు ,403 పుటలతో నిండి ఉంది.
•ప్రస్తుత రాజ్యాంగంలో 467 నిబంధనలు 12 షెడ్యూల్స్,25 భాగాలు కలవు.
•మొదటి రాజ్యాంగ సవరణ భూ సంస్కరణలకు సంబంధించినది .
•రాజ్యాంగంలో చేర్చిన భాగాలు 4(IVA,IXA,IXB,XIVA) తొలగించిన భాగాలు 1(VII) .
•రాజ్యాంగం లో చేర్చిన నిబంధనలు 94,తొలగించినవి 22.
భారత రాజ్యాంగంపై ప్రముఖుల అభిప్రాయాలు:-
•భారత రాజ్యాంగం న్యాయవాదుల స్వర్గం - ఐవర్ జెన్నింగ్స్
•అందమైన అతుకుల బొంత - గ్రాన్ విల్లీ ఆస్టిన్
•భారత రాజ్యాగం ఐరావతం లాంటిది- కామత్
•భారత రాజ్యాంగం అర్ధ సమాఖ్య-కె.సి.వేర్
•భారత రాజ్యాంగం సహకార సమైక్య - గ్రాన్ విల్లీ ఆస్టిన్

భారత రాజ్యాంగం లోని భాగాలు

భాగం తెలియ చేసే అంశం రాజ్యాంగ అధికరణములు
1 భారత భూభాగం రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాలు 1-4
2 పౌరసత్వం 5-11
3 ప్రాధమిక హక్కులు 12-35
4 ఆదేశిక విధులు 36-51
4 ఎ ప్రాధమిక సూత్రాలు 51 ఎ
5 కేంద్ర ప్రభుత్వం 52-151
6 రాష్ట్రప్రభుత్వాలు 152-237
7 1956 లో 7 వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 7 మరియు 9 వ భాగాలు తొలగించారు
8 కేంద్రపాలిత ప్రాంతాలు 239- 242
9 పంచాయితీ రాజ్ వ్యవస్థ 243,243(ఎ) -243(ఒ)
9 ఎ పట్టణ నగరపాలక సంస్థలు 243 (పి )-243( జడ్ -జి )
9 బి సహకార సంఘాలు 243 హెచ్ -243 టి
10 షెడ్యూల్ ఆదివాసీ ప్రాంతాలు 244-244 ఎ
11 కేంద్ర రాష్ట్రాల మధ్య శాసన పరిపాలనా సంబంధాలు 245-263
12 కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్ధిక సంబంధాలు 264-300ఎ
13 వాణిజ్య వ్యాపార సంబంధాలు 301-307
14 కేంద్ర రాష్ట్ర సర్వీసులు ,కమీషన్లు308-323
14 ఎ పరిపాలనా ట్రిబ్యూనల్ లు 323 ఎ -323 బి
15 ఎన్నికల కమీషన్ -ఎన్నికలు 324 -329
16 SC,ST ,ఆంగ్లో ఇండియన్ లకు గల రక్షణలు 330- 342
17 అధికార భాషలు 343- 351
18 అత్యవసర అధికారాలు 352- 360
19 రాష్ట్రపతి ,గవర్నర్లకు గల మినహాయింపులు 361- 367
20 రాజ్యాంగ సవరణలు 368
21 తాత్కాలిక ప్రత్యేక రక్షణలు 369 - 392
22 టైటిల్ -హిందీలో రాజ్యాంగ అనువాదం 393- 395
రాజ్యాంగం లోని షెడ్యూళ్ళు :- •షెడ్యూల్ సంఖ్య-1
షెడ్యూల్ లోని అంశం -29 రాష్ట్రాలు ,7 కేంద్రపాలిత ప్రాంతాల భౌగోళిక పరిధిని వివరిస్తుంది .
•షెడ్యూల్ సంఖ్య 2
షెడ్యూల్ లోని అంశం - ఇందులో రాజ్యాంగ బద్ధమైన సంస్థల యొక్క జీతభత్యాలు వివరిచబడతాయి .రాష్ట్రపతి ,గవర్నర్ , పార్లమెంట్ మరియు అసెంబ్లీ అధ్యక్షులు మరియు ఉపాధ్యక్షులు ,సుపీం కోర్ట్ ,హైకోర్ట్ జడ్జిలకు సంబంధించిన రాజ్యాంగ సదుపాయాలు
•షెడ్యూల్ సంఖ్య 3
షెడ్యూల్ లోని అంశం - పార్లమెంట్ మరియు శాసన సభ్యులు,కేంద్ర మంత్రులు మరియు సుప్రీం కోర్ట్ ,హైకోర్ట్ న్యాయమూర్తుల పదవీ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన అంశాలు .
•షెడ్యూల్ సంఖ్య 4
షెడ్యూల్ లోని అంశం - రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు రాజ్య సభలో స్థానాల కేటాయింపునకు సంబంధించినది ..
•షెడ్యూల్ సంఖ్య 5
షెడ్యూల్ లోని అంశం - ఇందులో షెడ్యూల్ ప్రాంతాల మరియు షెడ్యూల్ తెగల యొక్క పాలనకు సంబంధించిన విషయాలు ఉంటాయి .
•షెడ్యూల్ సంఖ్య 6
షెడ్యూల్ లోని అంశం - అసోం,మేఘాలయ,త్రిపుర ,మిజోరాం గిరిజన ప్రాంతాల గురించిన ప్రస్థావన ,పాలనాంశాలు
•షెడ్యూల్ సంఖ్య 7
షెడ్యూల్ లోని అంశం - కేంద్ర,రాష్ట్రాల మధ్య అధికారాల పంపిణీ
•షెడ్యూల్ సంఖ్య-8
షెడ్యూల్ లోని అంశం - రాజ్యాంగం ద్వారా గుర్తించబడిన అధికార భాషల గురించి వివరిస్తుంది .
•షెడ్యూల్ సంఖ్య-9
షెడ్యూల్ లోని అంశం - భూ సంస్కరణల గురించి
•షెడ్యూల్ సంఖ్య-10
షెడ్యూల్ లోని అంశం - పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం
•షెడ్యూల్ సంఖ్య-11
షెడ్యూల్ లోని అంశం - పంచాయితీ రాజ్ వ్యవస్థ
• షెడ్యూల్ సంఖ్య-12
షెడ్యూల్ లోని అంశం - నగర పాలక వ్యవస్థ
వివిధ దేశాల రాజ్యాంగాలు
వైమూర్ రాజ్యాంగం జర్మనీ
అస్థిర రాజ్యాంగం పాకిస్థాన్
పరిణామ రాజ్యాంగం ఇంగ్లాండ్
ధృఢ రాజ్యాంగం అమెరికా
టైలర్ మేడ్ రాజ్యాంగం ఫ్రాన్స్
ప్రసాదిత రాజ్యాంగం న్యూజిలాండ్