రైతుల ఉద్యమాలు

నీలి మందు విప్లవం (1859-60):-
• బెంగాల్ ప్రాంతంలో బలవంతంగా నీలి మందు పండించటాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమం ప్రారంభించారు .
• నాయకులు : 1.దిగంబర విశ్వాస్
• 2.బిష్ణు విశ్వాస్ .
• భారత దేశంలో మొదటి రైతు ఉద్యమం - నీలి మందు ఉద్యమం .
• 1860 లో బలవంతంగా పండించటాన్ని రద్దు చేస్తూ చట్టం చేశారు .
• నీలి మందు రైతు బాధలను దీన బంధ మిత్ర నీల్ దర్పణ్ అనే నాటకంలో వివరించెను .
పబ్నా ఉద్యమం (బెంగాల్)(1872-76):-
• తూర్పు బెంగాల్ లోని పబ్నా జిల్లాలో రైతులు సంఘాలు గా ఏర్పడి కొవులు చెల్లించ కుండ జమిందారులు పై దాడులు చేయ సాగారు .
• ప్రభుత్వం ఈ ఉద్యమాన్ని అణచి వేసి 1885 లో బెంగాల్ కౌలు దారీ చట్టం చేసి కౌలు దార్లకు చట్టం కల్పించాడు .
దక్కన్ అలజడలు (1875) :-
• వడ్డీ వ్యాపారులకు వ్యతిరేకంగా మహారష్ట్రలోని పూనా , అహ్మద్ నగర్ జిల్లాలలో సాయుధ తిరుగు బాటు జరిగింది .
• వడ్డీ వ్యాపారుల పై దాడి చేసి ఋణపత్రాలు తగుల పెట్టారు .
• సైన్యం ప్రవేశించి తిరుగు బాటును అణచివేసింది .
చంపారన్ సత్యాగ్రహం ( 1917):-
• బీహార్లో చంపారన్ అనే ప్రదేశం లో తీన్ కథియా విదానాన్ని వ్యతిరేకిస్తూ గాందీజి సత్యాగ్రహాన్ని ప్రారంభించారు .ఇది భారత దేశం లో గాందీజి నడిపిన మొదటి ఉద్యమం .
• ఈ ఉద్యమంలో గాంధీజి సహాయకులు
• 1.బాబూ రాజేంద్ర ప్రసాద్
• 2.జె.బి.కృపలాని
• 3.మహదేవ్ దేశాయ్
• 4.అనుగ్రహ నారాయణ .
• ఈ ఉద్యమం ఫలితంగా తీన్ కథియా విధానం రద్దు చేశారు .
ఖేడ/కైర సత్యాగ్రహం :(1918)(గుజరాత్ ) :-
• ఆంగ్లేయుల చట్టం ప్రకారం 25% కంటే దిగుబడి తక్కువగా ఉండే ప్రాంతాన్ని కరువు ప్రంతంగా ప్రకటిస్తారు .
• కానీ ఖేఢ ప్రాంతంలో 20% కన్నా తక్కువ దిగుబడీ ఉన్నప్పటికి అధికారులు పన్నులు కోసం వేధించారు .
• ఈ ఉద్యమంలో గాంధీజి సహాయకులు
• 1.వల్లభబాయ్ పటేల్
• 2.ఇందులాల్ యాఙ్ఞిక్ .
• ఈ ఉద్యమ ఫలితంగా పన్నులు రద్దు చేశారు .
మోప్లా రైతుల తిరుగు బాటు : -
• కేరళ లోని ముస్లిం రైతులు హిందూ జమిందారులు , వడ్డీ వ్యాపారులు , ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఈ తిరుగు బాటు చేసారు .
• పోలీసులు తిరురంగడి మసీద్ పై ఆయుదాలు కొరకు దాడి చేయగా ఈ ఉద్యమం ప్రారంభమయింది .
• ప్రభుత్వ కార్యాలయాలు భూస్వాములు వడ్డీ వ్యాపారులపై దాడులు జరిగాయి .
బార్దోలి సత్యాగ్రహం (1928):-
• గుజరాత్ లోని బార్దోలి అనే ప్రదేశం లో పన్నులను 22% పెంచారు .
• ఈ ఉద్యమ నాయకుడూ వల్లబాయ్ పటేల్ .
• ఈ ఉద్యమం తరువాత గాంధీజి సర్ధార్ అనే బిరుదు ను వల్లభాయ్ పటేల్ కి ఇచ్చాడు .
• ఈ పోరాట ఫలితంగా ప్రభుత్వం విచారణ సంఘం నియమించి , భూశిస్తు తగ్గించింది .