1857 సిపాయిల తిరుగుబాటు

1857 సిపాయిల తిరుగుబాటు వర్ణనలు -
• వి.డి . సావర్కర్ - ప్రప్రధమ స్వాతంత్ర సంగ్రామం
• టి.ఆర్ .హోం -నాగరికులు , అనాగరీకులు మధ్య సంఘర్షణ .
• రీస్ -సాంప్రదాయ శక్తులు క్రీస్టియానిటీకి వ్యతిరేకంగా చేసిన తిరుగుబాటు
• మాలిసన్ , టేలర్ - హిందూ , ముస్లింల తిరుగుబాటు .
• ఆర్ .సి మజుందార్ - ప్రధమ స్వాతంత్య్ర సంగ్రామం కాదు .
• 1857 తిరుగుబాటు పై ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అనే గ్రంధాన్ని వి.డి. సావర్కర్ రచించెను .
రాజకీయ కారణాలు :-
• సైన్య సహకార పద్ధతిని వెల్లస్లీ ప్రవేశపెట్టడం .
• డల్ హౌసీ ప్రవేశ పెట్టిన రాజ్య సంక్రమణ సిద్దాంతం .
• దుష్ట పరిపాలన పేరుతో స్వదేశీ రాజ్యాలను ఆక్రమించటం .
సామాజిక మత కారణాలు : -
• ప్రజల పై పన్నుల భారం ఎక్కువ .
• ఆoగ్లేయుల విధానాల వలన చేనేత పరిశ్రమలు , నౌకా నిర్మాణ పరిశ్రమ దెబ్బతిన్నాయి .
• సతీ సహగమన నిషేదం (1829) , బాల్య వివాహ నిషేదం , వితంతు పునర్వి వాహం (1856) మొదలగు చట్టాలు చేయటం .
• క్రైస్తవ మిషనరీలు రాక (1833)
• బలవంతపు మత మార్పిడిలు .
3. సైనిక కారణాలు :-
• మొత్తం ఆంగ్లేయ సైన్యంలో 7/8 వంతు మంది సిపాయిలు భారతీయులు జీతభత్యాలలో గానీ , పదోన్నతులలో గానీ ఆంగ్లేయ సిపాయితో పోల్చినప్పుడు వీరి పట్ల వివక్ష చూపే వారు .
• ప్రతీ రోజు గడ్డం తీయాలనే నిబందన విధించ బడింది .
• 1856 లో ప్రపంచంలో ఎక్కడైనా యుద్ధం చేయాలని జనరల్ ఎనలిస్ట్ మెంట్ Act చేశారు .
• ఎన్ ఫీల్డ్ రైఫిల్స్ ప్రవేశ పెట్టారు .
• ఈ తుపాకులలో ఉపయోగించే తూటాలు ఆవు క్రొవ్వు ,పంది కొవ్వుతో రూపొందించారనే వదంతి ఏర్పడింది .
• ఈ తుపాకులు ఉపయోగించటానికి నిరాకరించి 1857 ఫిబ్రవరి లో మంగళ్ పాండే అనే సిపాయి బారక్ పూర్ లో తన పై అదికారి కల్నల్ బాగ్ పై కాల్పులు జరిపాడు .దీనితో మంగల్ పాండేను ఉరి తీసాడు .
• మంగళ్ పాండే 34 వ భెటాలియన్ కు చెందిన సిపాయి .
ప్రారంభం : -
• 1857 ఏప్రిల్ లో మీరట్ లో సిపాయిలు ఎన్ ఫీల్డ్ తుపాకులు ఉపయోగించుటకు నిరాకరించారు .ఆంగ్లేయులు వారిని విచారించి 85 మందికి జైలు శిక్ష విధించారు .
• దీనికి నిరసనగా సిపాయిలు తమ అనుచరు;లను విడిపించుకొని డిల్లీ వైపు బయలు దేరారు .
• 1857 మే 10 న మీరట్ తిరుగుబాటు ప్రారంభమైనది .
ఢిల్లీ :-
• ఢిల్లీ చేరుకున్న సిపాయిలు ఎర్రకోటలోని ఆంగ్లేయ రెసిడెంట్ అధికారి సిమన్ రిఫ్లీ ని వధించి మొగల్ చక్రవర్తి రెండవ బహదూర్ షా జాఫర్ ను తమ నాయకుడిగా ప్రకటించారు .
• రెండవ బహదూర్ షా భారత చక్రవర్తిగా ప్రకటించబడ్డాడు .
• ఆంగ్లేయులు బహదూర్ షా ను బంధించి రంగూన్ జైలుకు పంపగా అచ్చటే మరణించాడు .
• ఇతని కుమారుడు,భార్యను ఆంగ్లేయులు కాల్చి చంపారు.
• దీనితో మొఘల్ వంశం అంతరించిపోయింది .
కాన్ పూర్ :-
• కాంపూర్ తిరుగు బాట్లకు నానాసాహెబ్ నాయకత్వం వహించాడు .
• ఇతని అసలు పేరు దొంతు పండిట్ చివరి పీష్వా బాజీరావు రెండవ దత్తపుత్రుడు .
• ఇతని సేనకు తాంతియా తోపే ,అజీముల్లాలు నాయకత్వం వహించారు .
• అలహాబాద్ లో 400 మంది ఆంగ్లేయులను తిరుగుబాటుదారులు చంపుటతో ఈ ఉద్యమం తీవ్ర స్థాయికి చేరుకుంది.
• కాంపెబెల్ అనే సైనిక అధికారి కాన్ పూర్ లో తిరుగుబాటు దారులను అణచివేసెను .
• నానాసాహెబ్ నేపాల్ పారిపోగా తాంతియా తోపే మధ్య భారత అడవులలోనికి వెళ్ళాడు.
• మాన్ సింగ్ అనే మహారాష్ట్ర సర్దార్ నమ్మక ద్రోహం వలన తాంతియా తోపే ఆంగ్లేయులకు చిక్కగా 1859 ఏప్రీల్ 19 న ఉరి తీయబడ్డాడు .
ఝాన్సీ :- ఝాన్సీ పాలకుడు గంగాధర రావు సంతానం లేక పోవటం వలన దామోదర్ రావ్ అనే బాలుడిని దత్తత తీసుకున్నారు .
• ఆంగ్లేయులు దీనికి అంగీకరించలేదు .
• గంగాధర్ రావ్ మరణం తో ఆంగ్లేయులపై అతని భార్య లక్ష్మీ బాయ్ పోరాటం ప్రారంభించినది .
• ఈమె అసలు పేరు మణి కర్ణిక
లక్నో (అవధ్) :- ఇక్కడ బేగం హజరత్ మహల్ తిరుగుబాటు చేసెను .
• క్యాంప్ బెల్ ఈ తిరుగుబాటును అణచివేసెను .
• ఆంధ్ర లో తిరుగుబాటు
• 1853 లో వహాబి ఉద్యమం సందర్భంగా కడప నవాబు గులాం రసూల్ ఖాన్ ఆంగ్లేయులపై జిహాద్ ప్రకటించాడు .
• దాని ప్రభావం 1857 వరకు సాగింది .
• ఫలితాలు :
• 1858 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం ఈస్టిండియా పాలన రద్దు చేయబడినది .
• బ్రిటిష్ గవర్నర్ జనరల్ ను గవర్నర్ జనరల్& వైశ్రాయిగా మార్చారు .
• మొదటి వైశ్రాయి లార్డ్ కానింగ్
• మొదటి భారత రాజకీయ వ్యవహారాల మంత్రి - ఛార్లెస్ ఉడ్స్
• 1858 తరువాత 563 రాజ్యాలు స్వదేశీ రాజ్యాలుగా ఉన్నాయి .