బాదామి చాళుక్యులు (పశ్చిమ చాళుక్యులు)

వీరి రాజధాని కర్ణాటక లోని బీజాపూర్ జిల్లాలో బాదామి / వాతాపి
• వీరు హరితీ పుత్రులుగ ప్రకటించుకున్నారు .(నాగార్జున కొండ)
• వీరి రాజ చిహ్నం - వృషభం .
• వీరి కదంబులకు సామంతులు.
జయ సింహ వల్లభుడు :-
• చాళుక్యుల మూల పురుషుడు .
• వాకాటకులను ధిక్కరించి వాతాపి రాజధానిగా పాలన చేశాడు .
మొదటి పులకేశి :-
• ఇతడు చాళుక్యుల రాజ్య స్థాపకుడు .
• బాదామిలో కోట నిర్మించాడు .ఇతని బిరుదు మహారాజు
• బాదామి శాసనం(క్రీ.పూ 543 ) ప్రకారం అశ్వమేధ యాగం నిర్వహించాడు .
• ఇతని బిరుదులు - రణవిక్రమ , చాళుక్య వల్లభ , శ్రీ పృధ్వీ వల్లభ .
మంగ లేషుడు :-
• గుజరాత్ లోని కాల చూరులను ఓడించి రేవతి ద్వీపం(గోవా ) ను ఆక్రమించాడు .
• ఇతని బిరుదు పరమ భాగవత .
• దురాశ పరుడైన మంగళేషుణి 609 లో వధించి రెండవ పులకేశి రాజయ్యాడు .
• బిళణుడు రాసిన విక్రమాంక దేవ చరిత్ర ప్రకారం బ్రహ్మదేవుడు యొక్క చుళుకం అరచేయి నుండి ఉద్భవించుట వలన చాళుక్యులనే పేరు వచ్చింది .
• చాళుక్యుల మూలపురుషుడు జయసిం హ వల్లభుడు
రెండవ పులకేశి (క్రీ.శ. 609 - 642):-
• ఈ వంశంలో అత్యంత గొప్ప వాడు రెండవ పులకేశి
• ఇతను శాసనాలను ఐహోలు శాసనం ద్వారా తెలుసుకోవచ్చు .ఈ శాసనమును ఇతని సేనాని రవికీర్తి రచించాడు
• రవి కీర్తి జైన మతస్థుడు .
• ఇతను నర్మదా నది తీరాన సకలోత్తర పథేశ్వరుడైన హర్షుడిని ఓడించి పరమేశ్వర అనే బిరుదు ధరించాడు .
• పల్లవ పాలకుడు మహేంద్ర వర్మ ను పుల్లలూరు లో ఓడించాడు .
• కృష్ణా,గోదావరి మధ్య గల తీరాంధ్రను జయించి తన సోదరుడైన కుబ్జ విష్ణువర్ధనుడిని వేంగి పాలకుడిగా నియామించాడు .
• అప్పాయిక అనే సామంతుని తిరుగుబాటుని అణచివేశాడు .
• గాంగులు మైసూర్,అలుపులు మలబార్ ,లాట రాజులు గుజరాత్ ,మౌర్యులు కొంకణి ని జయించాడు .
కుబ్జ విష్ణు వర్దనుడి యొక్క సంతతినే తూర్పు చాళుక్యులు లేదా వేంగీ చాళుక్యులు గా వ్యవహరిస్తారు .
• చైనా యాత్రీకుడు హుయాన్ త్సాంగ్ ఇతని అస్థానాన్ని సందర్శించాడు .
• ఈ వంశం లో చివరిపాలకుడు రెండవ కీర్తి వర్మను రాష్ట్రకూట రాజ్య స్థాపకుడు దంతి దుర్గుడు ఓడించి తరిమేశాడు .
• వీరు వేసర విధాన మనే నూతన నిర్మాణ శైలిని అభివృద్ధి చేశారు .
• ఇది ద్రావిడ మరియు బుద్ధులు శైలులు మిళితమై ఏర్పడినది .
• పట్టడకల్ లో విరూపాక్ష దేవాలయాన్ని రెండవ విక్రమాదిత్యునిభార్య లోకమహాదేవి ఎల్లోరాలో కైలాస దెవాలయ శైలిలో నిర్మించినది .
• మహబూబ్ నగర్ లోని అలంపూర్ లో వీరి కాలానికి చెందిన ఆలయాలు - నవ బ్రహ్మ ఆలయాలు ,జోగులాంబ ఆలయాలు
పరి పాలన :-
• వీరిది కేంద్రీకృత నిరంకుశ పాలన . మంత్రి పరిషత్ లేదు .
• వీరి రాజ్య భాగాలు .
• రాష్ట్రాలు -రాష్ట్ర పతి .
• విషయాలు -విషయాది పతి .
• గ్రామాలు - గౌడ , కరణం .
• భూమి శిస్తు 1/6 వ వంతు ఉందేది .
• సిద్ధ సైన్యం లేదు భూ స్వాములపై ఆధారపడేవారు .
• వీరి రాజ భాష సంస్కృతం
• వీరు వైదీక మతాభిమానులు
• పట్టాడక్కల్ లో 10 దేవాలయాలు నిర్మించారు .