పుష్య భూతి వంశం - హర్ష వర్ధనుడు

పుష్యభూతి వంశం :-
• వీరి రాజధానులు 1.స్థానేశ్వర్ 2.కన్యాకుబ్జ.
• పుష్య భూతి - ఇతను ఈ వంశ మూల పురుషుడు .
ప్రభాకర వర్ధనుడు :-
• ఇతని బిరుదు - మహారాజాధిరాజు
• ఇతను హణులను తరిమేసి 'హూణ హరిణి కేసరి ' అనే పేరు పొందాడు .
• ఈయన భార్య యశోధర్ముని కుమార్తె యశోమతి దేవి .
• వీరి సంతానం
• 1.రాజ్య వర్ధనుడు
• 2.హర్ష వర్ధనుడు
• 3.రాజ్య శ్రీ
• రాజశ్రీ ని కనోజ్ పాలకుడు మౌఖరీ వంశానికి చెందిన గృహవర్మకు ఇచ్చి వివాహం జరిపించాడు .
ప్రభాకర వర్ధుని మరణంతరం రాజ్య వర్ధుణుడు రాజ్య బాధ్యతలు స్వీకరించే సమయంలో నే మాల్వా రాజు దేవ గుప్తుడు , గౌడ రాజు శశాంకుడు కనోజ్ పై దండెత్తి గృహ వర్మను వధించి రాజ్యశ్రీ ని బంధించాడు
• రాజ్య వర్ధనుడు , కనోజ్ పై దండెత్తాడు గౌడ్ శశాంకుడు కుట్ర వల్ల రాజ్య వర్ధనుడు మరణించాడు .
హర్ష వర్ధనుడు :-
• రాజ్య వర్ధనుడు తరువాత హర్ష వర్ధనుడు రాజయ్యాడు .అప్పుడు అతని వయస్సు 16 సo||
• ఇటువంటి పరిస్థితులలో హర్షుడు కామరూప పాలకుడు భాస్కర వర్మ సహాయం తో దేవ గుప్తుడిని ఓడించాడు
• మాళ్వా పాలకునిగా మాధవ గుప్తుడిని నియమించారు .
• గౌడ శశాంకుని ఓడించి సోదరి రాజశ్రీ ని కాపాడాడు .
• 621 నుండి హర్షుడు స్థానేశ్వరం ,కానోజ్ రాజ్యాలు కలిపి పాలించాడు .
• హర్షుడు రాజధానిని స్థానేశ్వరం నుంచి కనోజ్ కి మార్చాడు .
• హర్ష శకం ను 606 లో ప్రారంభించినాడు .
హర్షుణి చరిత్రకు ఆధారాలు : -
• బాణుని రచనలు
• హర్షుని రచనలు
• ఐహోలు శాసనం
• హర్షుని బన్సీఖేరా మధుబన్ శాసనాలు హుయంత్సాంగ్ రచనలు .
• ఐహోలు శాసనంలోని హర్షుని బిరుదు - సకలోత్తర పథేశ్వర
• హర్షుడి ఆస్థాన కవులు -రచనలు
• బాణుడు - హర్ష చరిత్ర ,కాదంబరి ,పార్వతీ పరిణయం
• మయూరుడు - సూర్య శతకం
• భర్తృహరి -సుభాషిత శతకం
• దివాకరుడు ,మాతంగులు ఇతని ఆస్థాన కవులు
నలందా విశ్వ విద్యాలయం :-
• ఇతను నలందా విశ్వ విద్యాలయ అభివృద్దికి 100 గ్రామాలను దానం చేశాడు .
• ఈ విశ్వవిద్యాలయ పర్యవేక్షణకు శీలభద్రుడు ని నియమించాడు .
• నలందా విశ్వ విద్యాలయం స్థాపించింది - కుమార గుప్తుడు .
• నలందా విశ్వ విద్యాలయంలో పేరు పొందిన ఆచార్యులు-ధర్మ పాలుడు , ఆర్య దేవుడు .
• నలందా విశ్వ విధ్యాలయ గ్రంధాలయం - ధర్మ్ గంజ్ .
• నలందా విశ్వ విద్యాలయాన్ని నాశనం చేశింది - భక్తియార్ ఖిల్జీ.
• ఉత్తర భారత్ దేశాన్ని పాలించిన ఆఖరి హిoదు చక్ర వర్తి .-హర్షుడు
పరిపాలన :-
• హర్షుడు పరిపాలనలో గుప్తులను అనుసరించాడు.
• ప్రధానాదాయం భూమి శిస్తు 1/6 వంతు
• సమాజంలో స్త్రీ స్థానం దిగజారింది .
• రాజ్య ఆదాయంలో హర్షుడు 1/4 వ వంతు పండితులకు విద్యా సంస్థలకొరకు ఖర్చు చేసేవాడు .