ఉమ్మడి పౌరస్మృతిపై నిపుణుల కమిటీ
→ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతి అమలు కోసం ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది.
→దీనికి సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్ నేతృత్వం వహిస్తారని సీఎం పుష్కర్ సింగ్ ధామి పేర్కొన్నారు.
→ఇందుకు సంబంధించిన ఎన్నికల హామీని నిలబెట్టుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.
→అన్ని మతవర్గాల మధ్య ఏకరూపత తీసుకొచ్చి, దేవభూమి సంస్కృతిని ప్రోది చేయడం దీని ఉద్దేశమని పేర్కొన్నారు.